Tuesday, August 14, 2007

మన్మోహన్ సర్కార్ అణుగండం నుంచీ గట్టెక్కుతుందా?

లెఫ్ట్ హెచ్చరికలు లక్ష్యపెట్టక అమెరికాతో అణుబంధంలో ఎలాంటి తప్పూలేదని నొక్కి చెప్పిన మన్మోహన్ ప్రభుత్వం ఇరకాటంలో పడుతుందేమోననిపిస్తోంది. మద్యంతర ఎన్నికలొస్తే భారత రాజకీయ పటం ఎలా మారుతుందో?

పెరుగుతున్న ఇంధన అవసరాలను దృష్టిలో పెట్టుకుని కుదుర్చుకున్న ఒప్పందమేనని ప్రజలకు నచ్చచెప్పగలమనే ఆత్మ విశ్వాసంతోనో, లేక మద్యంతరానికి తగిన సమయమిదేనన్న అంచనాతోనో, మరో ప్రత్యామ్నాయం ప్రజల ముందు లేదన్న ధీమాతోనో కాంగ్రెస్ పార్టీ లెఫ్ట్ మాటల్ని పట్టించుకోవడం లేదనుకుంటా!

అణు సాంకేతిక పరిజ్ఞానాన్ని అమ్ముకుని సొమ్ముచేసుకోవడం అమెరికాకు ఎంత ముఖ్యమో, జాతి అవసరాలకు అనుగుణంగా లాభ సాటి లావాదేవీలు జరపడం ప్రజాస్వామ్య ప్రభుత్వాలకు అంతే ముఖ్యం! అతిముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు, ఒడంబడికలు కుదుర్చుకునేటప్పుడు పార్టిలతో ప్రమేయం లేకుండా ప్రజా ప్రతినిధులను,మేధావులను చర్చల్లో భాగస్వాములను చేసే సంస్కృతి మొదలైతే బావుణ్ణు. ఇలాంటి సంస్కృతితో కూడా కొన్ని నష్టాలు ఉంటాయనుకోండి!

త్యాగాలతోనే అభివృద్ధి సాధ్యమనే వాదన అన్ని సార్లు ఒప్పు కాదు!

0 comments: