ఋణాలను మాఫీ చేయడం కన్నా మెరుగైన ఆలోచన పాలకులకు తట్టదా?
మార్క్ ట్వెయినో మరో పెద్దాయనో - ఆకలేసిన వాడికి చేపలు తెచ్చి ఇవ్వడం కంటే, చేపలు పట్టడం నేర్పడం మంచిదన్నాట్ట!
ప్రజాస్వామ్య ప్రభుత్వమంటే - ప్రజల కొరకు, ప్రజల చేత ఎన్నుకోబడిన నాయకులే కదా!
నాయకులు ఉదారంగా ఋణాల మాఫీలనీ, పావలా వడ్డీలని, ఉచిత కరెంటని - కిలో రెండు రూపాయలకు బియ్యమనీ - ఓట్ల డబ్బాలు నింపుకోడానికి ఖజానా ఖాళీ చేస్తుంటారు!
కష్టపడే వాడెప్పుడూ కష్టపడుతూనే ఉంటాడు.
గానుగెద్దులా పని చేస్తూ, పన్నులు కడుతూ, ఖజానా నింపడానికి ఉడత సాయం చేస్తూనే ఉంటాడు!
బియ్యాన్ని కిలో ఇరవై రూపాయలు పెట్టి కొంటూనే ఉంటాడు. పెరిగే ధరలను, వ్యయాలను అందుకోవడానికి మరింత కష్టపడుతూ ఉంటాడు...ఆదాయాన్ని పెంచుకుంటూ ఉంటాడు.
పెరిగిన ఆదాయం మీద పన్నులు కడుతూనే ఉంటాడు. అవి మళ్ళీ ఋణాల మాఫీకో - పావలాకి కిలో నూనె పధకానికో - ఒక ఓటు కొంటే రెండో ఓటు ఉచితం స్కీముకో తరలి పోతూనే ఉంటాయి!
కష్టపడుతూనే ఉంటాడు! ఉడత సాయం చేస్తూనే ఉంటాడు!! తరలి పోతూనే ఉంటాయి!!!
Wednesday, March 19, 2008
Subscribe to:
Post Comments (Atom)


1 comments:
ఉడతసాయం పోలిక బాగా నచ్చింది.
Post a Comment